దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు నివాళులర్పించారు.
దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు నివాళులర్పించారు.
శనివారం ఉదయం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సమాధికి పుష్పాంజలి ఘటించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా దివంగత ఎన్టీఆర్ను ఉద్దేశిస్తూ, మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నపోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని ఈ గుండెని మరొక్కసారి సాకిపో తాతా.. అంటూ జూనియర్ చేసిన ట్వీట్ అందరిని ఆకట్టుకుంటుంది.
