మరోవైపు భద్రాచలంBhadrachalam దగ్గర గోదారమ్మ మహోగ్రరూపం
రాష్ట్రంలో వర్షాల తీవత్ర తగ్గింది. గత 24 గంటల్లో 8 జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. (ప్రతీకాత్మక చిత్రం) ప్రస్తుతం ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నదని, దీని ప్రభావం వల్ల ఈ నెల 19 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. (ప్రతీకాత్మక చిత్రం) శనివారం నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది (ప్రతీకాత్మక చిత్రం) మరోవైపు భద్రాచలంBhadrachalam దగ్గర గోదారమ్మ మహోగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకు వరద ప్రవాహం పెరగడంతో పాటు నీటి మట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే భద్రాచలానికి రాకపోకలు నిలిపివేయడం, టెంపుల్ టౌన్లో 144సెక్షన్ (144Section)విధించారు అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం) అయితే గోదావరి నీటమట్టం సుమారు 80అడుగులకు చేరుకున్నప్పటికి సిస్ట్యూవేషన్ని కంట్రోల్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్(KCR) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్(Someshkumar)ను ఆదేశించారు. (ప్రతీకాత్మక చిత్రం) తెలంగాణలో ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే వచ్చేశాయి. నైరుతి రుతుపవన మెఘాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి.ఈ కారణం వలనే తెలంగాణలో మే చివరి వారం నుంచే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడడం ప్రారంభించాయి. జూన్లో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి, ఆదిలాబాద్లో రాష్ట్రంలో అత్యధికంగా 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో కూడా వర్షం భీభత్సం సృష్టించింది. (ప్రతీకాత్మక చిత్రం) ఈ ఏడాది ఇప్పటి వరకు ఖమ్మం వాతావరణ కేంద్రంలో 91 మి.మీ, రామగుండం స్టేషన్లో 88 మి.మీ వర్షం కురిసింది. జూన్ 1 నుంచి మూడు జిల్లాల్లో అధిక వర్షపాతం, ఏడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 22 జిల్లాల్లో లోటు వర్షపాతం, ఒక జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది.
