రాష్ట్రంలో మద్యం దుకాణాలు మళ్లీ ప్రైవేటుకు
ఈ సారి కూడా రాష్ట్రంలో మద్యం దుకాణాలు మళ్లీ ప్రైవేటుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్థం చేస్తోంది. ప్రభుత్వ అధీనంలో ఉన్న అన్ని మద్యం దుకాణాలను ప్రైవేటుపరం చేసి మరింత ఆదాయం రాబట్టుకోవాలని ఆలోచన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గత ఆర్థిక సంవత్సరంలో 25 వేల కోట్ల విలువైన మద్యం విక్రయించి.. దాదాపు 20 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది రాష్ట్ర ప్రభుత్వం. మద్యం వ్యాపార పరిమాణం ఇంకా చాలా ఎక్కువగా ఉన్నా.. సరిగ్గా రాబట్టలేకపోతున్నామనే భావన ఎక్సైజ్ వర్గాల్లో ఉంది. దుకాణాల నిర్వహణను ప్రైవేటు వ్యాపారులకు అప్పగిస్తే కమీషన్ సొమ్ము కోసం వివిధ మార్గాల్లో విక్రయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారని భావిస్తున్నారు.
