Breaking News

1300 కోట్లు డ్రగ్స్ పట్టుబడి..



మరోసారి గుజరాత్‌లో డ్రగ్స్ కలకలం రేగింది.

కచ్ జిల్లాలోని కాండ్లా రేవులో 260 కేజీల హెరాయిన్‌ను గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ మార్కెట్ విలువ రూ. 1300 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.


ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇరాన్ మీదుగా కంటెయినర్లలో భారత్‌కు హెరాయిన్ తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు నిన్న సంయుక్తంగా దాడులు చేసి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని కంటెయినర్లలోనూ హెరాయిన్ ఉండొచ్చన్న అనుమానంతో వాటిని కూడా తనిఖీ చేస్తున్నారు.